జంషెడ్పూర్: జార్ఖండ్లో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత అన్నా వదినలతో పాటు వారి కుమారుడిని దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని దుమారియాలో గురువారం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి నిద్రిస్తున్న వారిపై దాడి చేసి అన్నావదినలను కిరాతకంగా హత్యచేశాడు.
ఇది గమనించిన వారి పదిహేనేళ్ల కుమారుడు తప్పించుకోవడానికి యత్నించగా.. వెంటాడి మరి హతమార్చాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిని వెంటనే టాటా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుకొని విచారిస్తున్నారు.