రిపబ్లిక్ డే రిహార్సల్స్లో విషాదం

13 Jan, 2016 12:17 IST|Sakshi
రిపబ్లిక్ డే రిహార్సల్స్లో విషాదం
కోలకతా:  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రిపబ్లిక్ డే రిహార్సిల్ లో అపశృతి చోటు చేసుకుంది.  కోలకతాలో రిపబ్లిక్ డే  పరేడ్  ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా  చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ఎయిర్ ఫోర్స్  అధికారి మరణించడం విషాదాన్ని నింపింది.     రిపబ్లికే డే సందర్భంగా జరుగుతున్న  రిహార్సల్స్ లో ప్రమాదవశాత్తూ ఓ  కారు ఢీకొని  విమానయాన  అధికారి   అభిమన్యు గౌడ్   ప్రాణాలు కోల్పోయారు.  
 
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరుగుతున్న రిహార్సల్స్ లో  గుర్తు తెలియని ఓ వ్యక్తి  ఆడీ కారుతో ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సంఘటన అనంతరం కారును వదిలి  డ్రైవర్ పరారయ్యాడు.   కారును సీజ్ చేసిన అధికారులు  అధికారులు దర్యాప్తు  చేపట్టారు.
మరిన్ని వార్తలు