అరుంధతీ రాయ్‌ని జీప్‌కు కట్టేయాలి

23 May, 2017 01:36 IST|Sakshi
అరుంధతీ రాయ్‌ని జీప్‌కు కట్టేయాలి

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, బాలీవుడ్‌ నటుడు పరేష్‌ రావల్‌ ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో రాళ్లు విసిరే వాళ్లను కాకుండా అరుంధతీ రాయ్‌ను ఆర్మీ జీప్‌కు కట్టేయాలని ఆయన ట్వీటర్‌లో వ్యాఖ్యానించారు.

మ్యాన్‌బుకర్‌ ప్రైజ్‌ విజేత, రచయిత్రి, మహిళా జర్నలిస్టు అయిన రాయ్‌ను అలా హింసించడం తప్పుకాదా అని ఓ వ్యక్తి ప్రశ్నించగా..మనకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని రావల్‌ బదులిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్న రాయ్‌.. కశ్మీర్‌లో సైన్యం ఓ యువకుడిని మానవకవచంగా వాడుకోవడాన్ని తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు