ఉత్తరాఖండ్ బాధితలకు సినీ నటుడు సూర్య రూ.10 లక్షల విరాళం

1 Jul, 2013 05:40 IST|Sakshi
ఉత్తరాఖండ్ బాధితలకు సినీ నటుడు సూర్య రూ.10 లక్షల విరాళం

ఉత్తరాఖండ్ వరద బాధితలకు తమిళ సినీ నటుడు సూర్య రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. దీనిని ప్రధానమంత్రి సహాయ నిధికి పంపనున్నట్టు ఆయన తెలిపారు. శివకుమార్ చారిటబుల్ ట్రస్ట్ 34వ విద్యార్థుల స్కాలర్ షిప్ అవార్డుల ప్రదానోత్సవం ఆది వారం చెన్నైలో జరిగింది. నటుడు శివకుమార్, ఆయన కుమారులు సూర్య, కార్తీ, కుమార్తె బృంద పాల్గొన్నారు.

ఇంటర్‌లో ప్రతిభ చూపిన 25 మంది విద్యార్థులకు రూ.10 వేల చొప్పున అందజేశారు. సూర్య మాట్లాడుతూ, ఉత్తరాఖండ్ ప్రళయం మనసును కలచి వేసిందన్నారు. చారిటబుల్ ట్రస్ట్, అగరం ఫౌండేషన్, తమ కుటుంబం తరఫున రూ.10 లక్షల విరాళం అందిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు