రైల్వే మృతుల పరిహారం 8 లక్షలకు పెంపు

27 Dec, 2016 02:50 IST|Sakshi

న్యూఢిల్లీ: రైల్వే ప్రమాదాల్లో ప్రాణాలు, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. నగదు సాయాన్ని రూ.4లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే చట్టం–1989లోని నిబంధనలను సవరించింది. రైల్వే ప్రమాదాలు( నష్టపరిహారం) సవరణ నియమాలు–2016 ప్రకారం మృతులకు, చేతులు, కాళ్లు కోల్పోయిన వారికి, కుటుంబీకులకు నష్టపరిహారం పెంచుతున్నట్లు అధికారిక ప్రకటన జారీచేసింది.

మరిన్ని వార్తలు