అగ్ని–2 రాత్రి పరీక్ష విజయవంతం 

17 Nov, 2019 07:38 IST|Sakshi

బాలాసోర్‌ (ఒడిశా) : భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని 2’కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) కాంప్లెక్స్‌ 4 నుంచి దీన్ని పరీక్షించామని రక్షణ శాఖ తెలిపింది. ఈ క్షిపణికి 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది. దాదాపు 20 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి బరువు సుమారు 17 టన్నులు. మరో 1000 కేజీల పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు. అగ్ని–2 క్షిపణిని మొదటిసారి 1999 ఏప్రిల్‌ 11న పరీక్షించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 20న పరీక్షించిన ఈ క్షిపణి ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలో చేరింది.  

మరిన్ని వార్తలు