న్యూఢిల్లీ: ఆహారభద్రతా పథకం ఆర్డినెన్స్ తేవడం ద్వారా 2009 ఎన్నికల మ్యానిఫేస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ చెప్పారు. వీలైనంత వేగంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు.
త్వరగా అమలుచేయాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు సోనియా సూచించారని చెప్పారు.
ప్రతిపక్షాలు ఈ బిల్లు రాకుండా పార్లమెంట్లో అడ్డుకున్నందునే తాము ఆర్డినెన్స్ తెచ్చినట్లు తెలిపారు. ఆగస్టు 20 నుంచి ఢిల్లీ, హర్యాన రాష్ట్రాలు అమలు చేస్తామని చెప్పాయన్నారు. మిగిలిన రాష్ట్రాలు వీలైనంత త్వరగా అమలు చేస్తామని చెప్పినట్లు తెలిపారు. ఈ పథకం వల్ల 82 కోట్ల మంది ప్రజలకు ఉపయోగం అని ఆయన చెప్పారు.