భారత ఎయిర్‌ చీఫ్‌ ‘సేఫ్’ : ఐఏఎఫ్‌

5 Dec, 2019 10:53 IST|Sakshi

హవాయి : ఐఏఎఫ్‌ చీఫ్‌ మార్షల్‌ రాకేశ్‌కుమార్‌ సింగ్‌ బదౌరియా క్షేమంగా ఉన్నారని వైమానిక దళ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. వివరాలు.. ఆసియా - పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతపై చర్చించడానికి అమెరికా మిలిటరీ స్థావరమైన హవాయిలోని పెర్ల్‌ హార్బర్‌లో వివిధ దేశాల వాయుసేనాధ్యక్షులతో ఓ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి బదౌరియా అక్కడికి వెళ్లారు. అయితే బుధవారం పెర్ల్‌ హార్బర్‌ నౌకాశ్రయంలో ఓ సెయిలర్‌ ముగ్గురిని కాల్చి చంపేసి అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోబదౌరియా పెర్ల్‌హార్బర్‌లోని ఎయిర్‌ బేస్‌లో ఉన్నారని, కాల్పుల ఘటన నౌకాశ్రయంలో జరిగిందని అధికార ప్రతినిధి వివరించారు. 

మరిన్ని వార్తలు