తమిళనాడులో జల్లికట్టు జోరు!

13 Jan, 2019 20:04 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో పొంగల్ వేడుకలు కోలాహలంగా జరుగుతున్నాయి. పండుగ సందర్బంగా నిర్వహించే జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 64 ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారీ ఏర్పాట్లు చేశారు. అవనియపురం, పాలమేడు, అనంగానల్లురులో జరిగే జల్లికట్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఇప్పటికే తమిళనాడు చేరుకున్నారు. జల్లికట్టులో పాల్గొనేందుకు 3400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2600 ఎద్దులు ఈసారి జల్లికట్టులో పాల్గొంటున్నాయి.

మరిన్ని వార్తలు