ఒకటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

29 Jun, 2019 09:03 IST|Sakshi

శ్రీనగర్‌: హిమాలయాల్లో కొలువై ఉన్న అమర్‌నాథుణ్ని దర్శించుకునే వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. బల్తాల్, పహల్గామ్‌ మీదుగా రెండు మార్గాల్లో సాగే 40 రోజుల అమర్‌నాథ్‌ యాత్రకు సీఆర్పీఎఫ్‌తోపాటు కశ్మీర్‌ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. తీర్థయాత్ర సందర్భంగా భద్రతా ప్రమాణాలను తుచ తప్పకుండా పాటించాలని హోం మంత్రి అమిత్‌ షా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు