జమ్మూ కశ్మీర్ :
అమర్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్లోని రాంబస్ జిల్లా జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రకు బయలు దేరిన బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతిచెందగా, 19 మందికి గాయాలయ్యాయి.
ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.