ప్లీజ్‌.. నన్ను పిలవొద్దు!

11 Nov, 2018 05:06 IST|Sakshi

కోల్‌కతా: 24వ కోల్‌కతా అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభ కార్యక్రమంలో శనివారం సరదా సన్నివేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలాసార్లు అతిథిగా హాజరయ్యానని, ఇకపై తనని ఆహ్వానించొద్దని మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ విజ్ఞప్తి చేయగా, అలా కుదరదంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలూపారు. అమితాబ్‌ మాట్లాడుతూ పదేపదే ఈ కార్యక్రమానికి రావడం వల్ల తాను కొత్తగా చెప్పేదేమీ లేదని, ఇకపై తనని ఆహ్వానించొద్దని పలుమార్లు వేడుకున్నా సీఎం వినడంలేదని అన్నారు. అందుకే బెంగాలీలో ’మేడం దయచేసి నా మాటలు వినండి. ఇకపైనైనా నాకు ఈ కార్యక్రమం నుంచి మినహాయింపు ఇవ్వండి’ అని విజ్ఞప్తిచేశారు. వచ్చే ఏడాది జరగబోయేది 25వ వేడుక కాబట్టి అప్పుడు కూడా అమితాబ్‌ రావాల్సిందేనని మమతా చెప్పారు.

మరిన్ని వార్తలు