ఉంపన్‌: నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు

21 May, 2020 15:38 IST|Sakshi

కోల్‌కతా :  ‘ఉంపన్‌’ తుపాను  వల్ల  పశ్చిమ బెంగాల్‌లో భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఉంపాన్‌ తీవ్ర రూపం దాల్చడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభంవించింది. రవాణా వ్యవస్థ, విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. ఉంపాన్‌ దాటికి పశ్చిమబెంగాల్‌, ఓడిశా రాష్ట్రాల్లో యుద్ద పరిస్థితులు నెలకొన్నాయి. ఉంపన్‌ తుపాను పశ్చిమ బెంగాల్‌ను అతలాకుతలం చేసిన తరువాత ప్రస్తుతం కోల్‌కతా విమానాశ్రయాన్ని తాకింది. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌‌ నీట మునిగింది. ఎయిర్‌పోర్టు నీటితో నిండిపోవడంతో విమానాశ్రయం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. నీటితో నిండిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు దృశ్యాలు చూస్తుంటే పెను తుపాన్‌ ఉంపన్‌  ఎంత వినాశనం కలిగించిందో తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు