విధి వెక్కిరించింది.. ప్రాణం పోయింది

14 Sep, 2017 13:52 IST|Sakshi
విధి వెక్కిరించింది.. ప్రాణం పోయింది

న్యూఢిల్లీ : విధి అతడిని వెక్కిరించింది. బతుకు దెరువు కోసం ఆటో నడుపుకుంటున్న అతడిని మృత్యువు లారీలోని ఇనుపరాడ్ల రూపంలో వచ్చి కబళించింది. తెల్లవారు జామునే ప్రయాణీకులను ఎక్కించుకొని వెళుతున్న అతడు ముందు వెళుతున్న లారీ ఢీకొట్టడం అందులోని ఇనుపరాడ్లు నేరు అతడి శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ప్రయాణీకులు సైతం గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నరేశ్‌ కుమార్‌(40) అనే వ్యక్తి ఢిల్లీలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

తెల్లవారు జామున 4.30గంటల ప్రాంతంలో నిజాముద్దీన్‌ బ్రిడ్జి వద్ద అతడి ఆటో నోయిడా వైపు వెళుతూ ముందున్న లారీని ఢీకొట్టింది. తెల్లవారు జాముకావడంతో లారీలోని ఇనుపుచువ్వలు ముందుకు వచ్చి ఉండటం అతడు గమనించలేదు. దీంతో అవి నేరుగా అతడి శరీరంలోకి దూసుకెళ్లి ప్రాణాలు విడిచాడు. మరోపక్క, ఢిల్లీలోని ఓ రాయబార కార్యాలయం తచ్చాడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరిగి వస్తుండగా వారి వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది. దీంతో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మరిన్ని వార్తలు