చిత్తూరు : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ కె. వినాయకన్ మృతదేహం పూతలపట్టు చేరుకుంది. వినాయకన్ భౌతిక కాయానికి పోలీసులు, విద్యార్థులు సంతాపం తెలిపారు. పూతలపట్టు మండలం చిన్నబండపల్లెకు చెందిన వినాయకన్ (28) అయిదేళ్ల కిందట ఢిల్లీలోని ఎన్డీఆర్ఎఫ్ (నేషనల్ డిఫెన్స్ రెస్క్యూ ఫోర్స్) 9వ బెటాలియన్లో చేరారు.
ఉత్తరాఖండ్ సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వినాయకన్ గత మంగళవారం జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వినాయకన్కు ఈనెల 1న బంధువుల అమ్మాయితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కాగా వినాయకన్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.