సివిల్స్ టాపర్ తెలుగు విద్యార్థి

27 Apr, 2018 20:22 IST|Sakshi
దురిశెట్టి అనుదీప్

సాక్షి, న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్- 2017 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోనే నెంబర్‌వన్ ర్యాంకును దురిశెట్టి అనుదీప్ సొంతం చేసుకున్నారు. సివిల్స్‌-2017 మెయిన్స్‌ తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.in లో పొందుపరిచింది.   

గతేడాది జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పాసైన వారికి అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 మధ్యలో సివిల్స్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌ యూపీఎస్సీ నిర్వహించింది. మూడు స్టేజీల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ను యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్‌, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది.  

ర్యాంకు      టాపర్లు (తెలుగు రాష్ట్రాలు)
1       దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్‌పల్లి)
43     శీలం సాయితేజ
100    నారపురెడ్డి శౌర్య
144    మాధురి
195    వివేక్ జాన్సన్
607    కృష్ణకాంత్‌ పటేల్‌
624    వై అక్షయ్ కుమార్
816    భార్గవ శేఖర్

మరిన్ని వార్తలు