ఏపీ మండలి బిల్లుకు లోక్సభ ఆమోదం

17 Mar, 2015 21:37 IST|Sakshi

 న్యూఢిల్లీః ఏపీ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచుతూ  ఏపీ పునర్ వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2015ను లోక్‌సభ ఈ రోజు ఆమోదించింది.  ఈ బిల్లుపై సభలో మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది.  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఈ అంశంపై మాట్లాడారు.

పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న లోపాలన్నింటినీ సవరించేందుకు సమగ్ర బిల్లును తీసుకొస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు  హామీ ఇచ్చారు. ఇందుకు కొంత సమయం పడుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు  చెప్పారు.

>
మరిన్ని వార్తలు