న్యూఢిల్లీః ఏపీ శాసనమండలిలో సభ్యుల సంఖ్యను 50 నుంచి 58కి పెంచుతూ ఏపీ పునర్ వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2015ను లోక్సభ ఈ రోజు ఆమోదించింది. ఈ బిల్లుపై సభలో మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఈ అంశంపై మాట్లాడారు.
పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న లోపాలన్నింటినీ సవరించేందుకు సమగ్ర బిల్లును తీసుకొస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు హామీ ఇచ్చారు. ఇందుకు కొంత సమయం పడుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు.