అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఆవిష్కరణ

27 Jul, 2016 09:18 IST|Sakshi
అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఆవిష్కరణ

రామేశ్వరం: భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఎపిజె అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్ బుధవారమిక్కడ ఆవిష్కరించారు. అలాగే రామేశ్వరంలో ఆయన పేరిట నిర్మించే స్మారక కేంద్రానికి వారు శంకుస్థాపన చేశారు.  కలాం స్మారక చిహ్నంగా  ఓ లైబ్రరీని, మ్యూజియంను సైతం నిర్మించనున్న విషయం తెలిసిందే. మరోవైపు కలాంకు దేశప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలాంను గుర్తు చేసుకున్నారు. ఆయనను భౌతికంగా కోల్పోయినా, కలాంను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఆమె అన్నారు.




 

మరిన్ని వార్తలు