కొత్త ఆర్మీ చీఫ్ నియామకానికి లైన్ క్లియర్

13 May, 2014 01:23 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్మీ కొత్త చీఫ్ నియామకం విషయంలో ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంలో ముందుకే వెళ్లాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ పదవికి వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ పేరును కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ)కి రక్షణ శాఖ సిఫారసు చేసింది.

లెఫ్టినెంట్ జనరళ్లలో ఈయనే సీనియర్. ప్రధాని అధ్యక్షతన గల ఏసీసీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల సమయంలో ఆర్మీ కొత్త చీఫ్ నియామకం చేపట్టడంపై బీజేపీ తీవ్రంగా తప్పుపట్టడంతో దీనిపై వివాదం నెలకొంది. ఈ నిర్ణయాన్ని ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి వదిలివేయాలని బీజేపీ డిమాండ్ చేయడంతోపాటు దీనిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు