ఇవి ఊహించని ఫలితాలు : జైట్లీ

11 Dec, 2018 21:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయిదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందించారు. ఈ ఫలితాలు తాము ఊహించని విధంగా వెల్లడయ్యాయని జైట్లీ వ్యాఖ్యానించారు. హిందీ రాష్ర్టాల్లో ఓటమిపై విశ్లేషించుకోవాల్సిన సందర్భమిదని అన్నారు.

తాము 15 సంవత్సరాలుగా చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్నామని చెబుతూ అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత లేకున్నా ప్రజలు మార్పు కోరుకున్నారని అభిప్రాయపడ్డారు. కాగా రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పాలక బీజేపీని మట్టికరిపించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు