న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో మరణించిన వారి కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిహారం ప్రకటించారు. అల్లర్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా... ఘర్షణల్లో కాలిపోయిన ఇళ్ల యజమానులకు రూ. 4 లక్షలు.. వాటిలో అద్దెకు ఉండే వాళ్లకు రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా... పెంపుడు జంతువులను కోల్పోయిన వారికి రూ. 5 వేలు.. అల్లర్లలో రిక్షాలు ధ్వంసమైతే యజమానులకు రూ. 25 వేలు, ఇ- రిక్షాల యజమానులకు రూ. 50 వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అల్లర్లలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఖర్చులు సైతం కూడా ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా బాధిత కుటుంబాలకు ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వం చెల్లించనున్న నష్ట పరిహారం: