అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహిళ

2 Dec, 2017 09:55 IST|Sakshi

దిబ్రుఘడ్‌ : తలుచుకుంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదని మరోసారి రుజువైంది. భాష రాకపోయినా అస్సాంకు చెందిన ఓ మహిళ వస్త్రంపై భవద్గీతను నేసి వార్తల్లో నిలిచింది. 

గతేడాది డిసెంబర్‌లో దిబ్రుఘడ్‌కు చెందిన హేమప్రభ ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. సంస్కతం భాషలో భవద్గీతలోని 500 శ్లోకాలు... ఆంగ్ల భాషలో ఓ అధ్యయనాన్ని ఆమె నేశారు. ఇందుకోసం ఆయా భాషల పండితుల సహకారం ఆమె తీసుకున్నారు.

ఇంతకు ముందు ఆమె 80 అడుగుల పొడవు, 17 ఇంచుల వెడల్పు ఉన్న సిల్క్‌ క్లాత్‌ పై శంకర్‌దేవ్‌ గుణమాలను నేశారు. ఇందుకుగానూ ఆమెకు 9 నెలల సమయం పట్టిందంట. తన కళలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆమె చెబుతున్నారు.

మరిన్ని వార్తలు