అక్కడ అత్యధికంగా నోటా ఓట్లు నమోదు

11 Mar, 2017 17:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో అత్యధికంగా నోటా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 1.2 శాతం మంది నోటా బటన్‌ను నొక్కినట్లు తేలింది. ఆ తర్వాత స్థానంలో ఒక్క శాతంతో ఉత్తరాఖండ్‌ నిలిచిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ విజయ ఢంకా మోగించిన ఉత్తరప్రదేశ్‌లో 0.9 శాతం, పంజాబ్‌తో 0.7శాతం, మణిపూర్‌లో 0.5 శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చని సందర్భాల్లో ఓటర్లు నోటాను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

 

మరిన్ని వార్తలు