దోపిడీ ముఠా కాల్పులు..

28 Feb, 2015 03:59 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ముసుగులు ధరించిన  దుండగులు శుక్రవారం ముగ్గురు ఏటీఎం సిబ్బందిని కాల్చేసి, రూ.50 లక్షలను దోపిడీ చేశారు. లక్నో వర్సిటీకి సమీపంలోని బాబూగంజ్ ప్రాంతంలో పట్టపగలు చోటుచేసుకున్న ఈ ఉదంతం సంచలనం రేకెత్తించింది.  మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది తమ ఏటీఎం కోసం వ్యానులో నగదు తెచ్చారు.
 
 వారు ఏటీఎం బయట ఉండగా మోటారు సైకిలుపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు వారిపై అత్యంత సమీపం నుంచి  కాల్పులు జరిపారు. వ్యానులోని డబ్బును దోచుకెళ్లారు. కాల్పుల్లో అనీల్ సింగ్ (40), అరుణ్‌కుమార్(45), అవినాశ్ శుక్లా (35) ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు సంఘటనా స్థలంలోనే చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు.  నిందితుల్లో ఇద్దరు కాల్పులకు తెగబడినట్లు, అనంతరం మోటారు సైకిల్‌పై పరారైనట్లు సమాచారం.

మరిన్ని వార్తలు