-

పారిస్‌లోని ఐఏఎఫ్‌ ఆఫీస్‌లో చొరబాటు

23 May, 2019 05:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కార్యాలయంలోకి ఆదివారం కొందరు దుండగులు చొరబడ్డారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇది గూఢచారుల పని అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన గురించి అటు ఐఏఎఫ్‌ కానీ, ఇటు రక్షణ మంత్రిత్వ శాఖగానీ ఏ ప్రకటనా చేయలేదు. ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలను భారత్‌ కొనుగోలుచేస్తుండటం తెల్సిందే. ఆ విమానాల తయారీని ఈ ఆఫీస్‌ పర్యవేక్షిస్తోంది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలను దొంగిలించేందుకే దుండగులు కార్యాలయంలోకి ప్రవేశించారనే అనుమానాలు ఉన్నాయి. స్థానిక పోలీసులు కేసును విచారిస్తున్నారు.  

మరిన్ని వార్తలు