న్యూఢిల్లీ: దేశప్రజలు స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న ‘సంకల్ప్ పర్వం’ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు కృషి చేస్తామని పౌరులు ఆరోజున సంకల్పించుకోవాలని సూచించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవమైన ఈ నెల 15న ‘సంకల్ప్ పర్వం’ నిర్వహించుకోవాలని సిబ్బంది శిక్షణ శాఖ తన తాజా ఉత్తర్వులో పేర్కొంది.
‘2022నాటికి క్విట్ఇండియా ఉద్యమం 75ఏళ్లు పూర్తిచేసుకుంటుంది. పౌరులంతా సమష్టిగా సమస్యలపై పోరాడి కొత్త భారతావనిని ఆవిష్కరిస్తే మన స్వాతంత్య్రయోధులు గర్విస్తారు’ అని పేర్కొంది.