1993, అక్టోబర్: అడ్వాణీతో పాటు మరి కొందరు నేతలు ఈ కుట్రలో భాగస్వాములని సీబీఐ కాంపోజిట్ చార్జ్షీట్ దాఖలు చేసింది.
2001, మే 4: అడ్వాణీ, జోషీ, ఉమాభారతి, బాల్థాకరే తదితరులపై కేసు విచారణను అదనపు సీబీఐ కోర్టు కొట్టివేసింది.
2004, నవంబర్ 2: సాంకేతిక కారణాలను చూపి కేసును కొట్టివేయడంపై సీబీఐ హైకోర్టులోని లక్నో బెంచ్ను ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం నిందితులకు నోటీసులు జారీ చేసింది.
2010, మే 20: సీబీఐ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దాఖలు చేసిన పునర్విచారణ పిటిషన్కు ఎటువంటి యోగ్యత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
2011, ఫిబ్రవరి: హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది.
2017, మార్చి 6: బాబ్రీ కుట్ర కేసులో బీజేపీ నేతలపై పునర్విచారణకు అత్యున్నత న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.
మార్చి 21: అయోధ్య వివాద పరిష్కారానికి తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాలని సుప్రీం కోర్టు సూచించింది.
ఏప్రిల్ 6: నిర్ణీత సమయంలో విచారణ పూర్తిచేయడానికి సుముఖత వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, సీబీఐ విజ్ఞప్తిపై ఆదేశాలను రిజర్వ్ చేసింది.
ఏప్రిల్19: అడ్వాణీ, జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతీలపై నేరపూరిత కుట్రకు సంబంధించి విచారణను సుప్రీం పునరుద్ధరించింది. అంతేకాకుండా కరసేవకులతో పాటు వీఐపీలను వీరితో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది.