రాఖీ యాదవ్ మళ్లీ జైలుకు..

28 Oct, 2016 12:04 IST|Sakshi
రాఖీ యాదవ్ మళ్లీ జైలుకు..

న్యూఢిల్లీ : జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమ దేవి కుమారుడు రాఖీ యాదవ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. టీనేజ్ యువకుడి హత్య కేసులో రాఖీ యాదవ్కు పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్పై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. దీంతో అతడు తిరిగి జైలుకు వెళ్లనున్నాడు.

కాగా రాఖీ యాదవ్ బెయిల్ మంజూరు కావడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న అక్కసుతో ఆదిత్య సచ్దేవ్ అనే యువకుడిని రాఖీ యాదవ్ ఈ ఏడాది మే నెలలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. గత వారమే పట్నా హైకోర్టు రాఖీ యాదవ్కు బెయిల్ మంజూరు చేయటంతో మృతుడి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు