న్యూఢిల్లీ:
ప్రముఖ బెంగాలీ కవి శంఖ ఘోష్ను దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2016 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో శంఖ ఘోష్ 52వ వారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా భారతీయ జ్ఞాన్పీఠ్ ఈ పురస్కారాన్ని అందిస్తోంది.
దీన్ని 1961లో ఏర్పాటు చేశారు. శంఖ ఘోష్ ప్రస్తుత బంగ్లాదేశ్లోని చాందీపూర్లో జన్మించారు. 2011లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించింది.