ఆ ముగ్గురికి భారతరత్న ఇవ్వండి

27 Oct, 2019 05:11 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని కాంగ్రెస్‌ నేత, ఆనంద్‌పుర్‌ సాహెబ్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మనీశ్‌ తివారీ కోరారు. అంతకన్నా ముందు వారిని ‘షహీద్‌ ఎ ఆజమ్‌’బిరుదుతో సత్కరించాలని, మొహాలిలోని చండీగఢ్‌ విమానాశ్రయానికి భగత్‌సింగ్‌ పేరు పెట్టాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించడం ద్వారా ఈ ముగ్గురు వారి కాలంలో ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించారని, ఆ క్రమంలోనే 1931 మార్చి 23వ తేదీన దేశంకోసం ప్రాణాలు అర్పించారని మనీశ్‌ తివారీ తెలిపారు. 

మరిన్ని వార్తలు