బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త కాల్చివేత

27 May, 2019 10:16 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బట్పారాలో ఆదివారం రాత్రి బీజేపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. చందన్‌ సాహు అనే 36 సంవత్సరాల బీజేపీ కార్యకర్త రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు ఆయనను కాల్చి చంపారు. జగ్ధాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కలితల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని చౌసొట్టిపల్లి వాసిగా గుర్తించారు.

చందన్‌ తన ఇంటికి వెళుతుండగా బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆయనను అడ్డగించి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. చందన్‌ను బట్పారా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అమేథిలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనుచరుడు, బీజేపీ కార్యకర్త సురేంద్ర సింగ్‌ను దుండగులు కాల్చిచంపిన కొద్ది గంటల్లోనే బెంగాల్‌లో ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు