మాజీ న్యాయమూర్తి కారుపై కాల్పులు

28 May, 2016 13:23 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్ లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ సభ్యుడు జస్టిస్ యూకే ధయాన్స్ కారుపై  శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ధయాన్ ఎయిర్ పోర్టు నుంచి తన భార్యతో కలిసి వస్తుండగా ఈ దాడి జరిగింది. దాడి నుంచి న్యాయమూర్తి దంపతులు, డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు.

ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. దీనిపై స్పందిచిన బీజేపీ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని ఆరోపించింది.

మరిన్ని వార్తలు