పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

2 Aug, 2018 11:48 IST|Sakshi
పార్టీ ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ

సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ లోక్‌సభ ఎంపీలందరూ నేడు, రేపు విధిగా సభలో ఉండాలని మూడు వాక్యాలతో కూడిన విప్‌ను  బీజేపీ గురువారం జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టనుండటంతో సభ్యులకు విప్‌ జారీ చేసింది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును సభ ముందుంచేందుకు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

అంతకుమందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్ధాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ బిల్లుకు మద్దతివ్వాలని విపక్షాలను ప్రభుత్వం కోరింది. పార్లమెంట్‌లో అవాంతరాలతో కీలక సభా సమయం వృధా అవుతోందని ప్రధాని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా పార్లమెంట్‌ ఉభయసభలూ సాగాలని ఆకాంక్షించారు.

>
మరిన్ని వార్తలు