'షారుఖ్‌పై నా ట్వీట్లను అపార్థం చేసుకున్నారు'

4 Nov, 2015 14:09 IST|Sakshi
'షారుఖ్‌పై నా ట్వీట్లను అపార్థం చేసుకున్నారు'

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకున్నారని, అందుకే ఆ ట్వీట్లను తొలగిస్తున్నానని బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వార్గియా తెలిపారు. దేశంలో తీవ్ర అసహనం నెలకొందని షారుఖ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విజయవార్గియా తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. షారుఖ్ మనసంతా పాకిస్థాన్‌లోనే ఉందని, ఆయన దేశద్రోహి అని విమర్శించారు.

విజయ్‌వార్గియా టిట్టర్‌లో చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ ఇటీవల పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చిన బీజేపీ అధినాయకత్వం ఆయన వ్యాఖ్యలకు దూరం జరిగింది. ఈ నేపథ్యంలో షారుఖ్‌పై తన ట్వీట్లను వెనుకకు తీసుకుంటున్నట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వార్గియా తెలిపారు. ఎవరినీ గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు