బస్సు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

30 Apr, 2016 18:33 IST|Sakshi
బస్సు ప్రమాదంలో బీజేపీ నేత మృతి

ఫిరోజాబాద్(ఉత్తరప్రదేశ్): వోల్వో బస్సును స్టేషనరీ ట్రక్కు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఫిరోజాబాద్లోని తండ్లా బ్రిడ్జిపై శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే హన్సరాజ్ వర్మ అక్కడిక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీ నుంచి లక్నోకు బయల్దేరిన వోల్వో బస్సును తాండ్ల బ్రిడ్జిపై ఓ ట్రక్కు ఢీకొట్టినట్టు ఎస్ఎస్పీ అశోక్ కుమార్ శర్మ వెల్లడించారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, మృతిచెందిన బీజేపీ నేత హన్సరాజ్.. గతంలో ఈత్ జిల్లా, నిదౌళ్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.

మరిన్ని వార్తలు