న్యూఢిల్లీ: విఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ) వైస్ చాన్సలర్గా బీజేపీ నేత సుబ్రమణ్యస్వామిని నియమించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ... స్వామితో మాట్లాడి వీసీ పదవిని చేపట్టాలని కోరినట్లు సమాచారం. అయితే వీసీ పదవిని చేపట్టడానికి స్వామి కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది.
మానవవనరుల శాఖ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా స్వామి ట్వీటర్లో స్పందిస్తూ... ‘నాకు వీసీ పదవి ఆఫర్ చేశారని మీడియా ఆగ్రహంతో ఉంది. నాకైతే ఎలాంటి ఆఫర్ రాలేదు’ అని పేర్కొన్నారు.