ఆమ్ ఆద్మీకి బీజేపీ ఎంపీ ధన్యవాదాలు

11 Feb, 2015 18:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి కంటే కాంగ్రెస్ గల్లంతుకావడం బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్కు అమితాన్నందాన్ని కలిగించినట్టుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.

ఢిల్లీలో తమ ఓటమిని అంగీకరిస్తున్నామని సాక్షి మహారాజ్ అన్నారు. కాగా నలుగురు పిల్లల్ని కనాలన్న తన వ్యాఖ్యల వల్ల పార్టీ ఓడిపోలేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు