ఎంపీ సహాయకుడిని చంపేశారు

26 Jan, 2017 19:19 IST|Sakshi
ఎంపీ సహాయకుడిని చంపేశారు

న్యూఢిల్లీ: బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. కేశవానంద గిరి అనే ఓ బీజేపీ ఎంపీ కీలక అనుచరుడు, సహాయకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనూహ్యంగా అతడిపై తుపాకులతో కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ ఘటన బిహార్‌లోని మాంఝాలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు