సాక్షి,కోల్కతాః నారదా స్టింగ్ కేసులో తృణమూల్ నేతలకు సీబీఐ సమన్ల జారీ నేపథ్యంలో కేంద్రంపై ఆ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శల దాడి పెంచారు. బీజేపీ రాజకీయ కక్ష సాధించేందుకు సీబీఐని సాధనంగా వాడుకుంటోందని ఆరోపించారు. పార్టీ నాయకులను వేధించేందుకే విచారణ చేపట్టారని విమర్శించారు. తృణమూల్ కోర్ కమిటీ భేటీలో మమతా బెనర్జీ మాట్లాడారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని మమతా బెనర్జీ ఈ సమావేశంలో అన్నట్టు తృణమూల్ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.
నారదా స్కామ్లో పార్టీ నేతలకు వ్యతిరేకంగా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆమె చెప్పారన్నారు. దుర్గాపూజ, మొహరం సందర్భంగా బీజేపీ మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని దీదీ పార్టీ నేతలకు సూచించారన్నారు.