-

రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా

17 Aug, 2019 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఆదివారం రోజు మధ్యాహ్నం 11 గంటల 55 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి 1.30 కి చేరుకోనున్నారు. ముందుగా అక్కడ లంచ్‌ చేసి 2 గంటలకు మున్సిపల్‌ ఎన్నికల క్లస్టర్‌ ఇంచార్జ్‌ల రాష్ట్ర అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం 4 గంటల 10 నిమిషాలకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు హరిత ప్లాజాలో కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొని రాత్రి అక్కడే బసచేయనున్నారు. 19వ తేది సోమవారం ఉదయం ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని అనంతరం అంబేద్కర్‌ కాలేజీలో మొక్కలు నాటనున్నారు.

మరిన్ని వార్తలు