కోల్కతా లోకల్ ట్రైన్లో పేలుడు,17 మందికి గాయాలు

12 May, 2015 07:43 IST|Sakshi
కోల్కతా లోకల్ ట్రైన్లో పేలుడు,17 మందికి గాయాలు

కోల్ కతా: లోకల్ ట్రైన్ లో పేలుడు సంభవించి సుమారు 17 మంది గాయపడ్డ సంఘటన కోల్కతాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. సీల్డా-కృష్ణానగర్  రైలు మంగళవారం తెల్లవారుజామున 3:55 గంటలకి టిటాఘడ్ స్టేషన్ నుంచి బయలుదేరిన తరువాత ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా లోకల్ ట్రైన్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు