ఒక జవాను మృతదేహం లభ్యం

8 Feb, 2016 20:12 IST|Sakshi
ఒక జవాను మృతదేహం లభ్యం

శ్రీనగర్: భారత సైనికులపట్ల విషాదంగా మారిన సియాచిన్ మంచుకొండలవిరిగిపాటు ఘటనలో ఎట్టకేలకు ఓ సైనికుడి మృతదేహం లభ్యమైంది. మరో తొమ్మిదిమంది సైనికులు మృతదేహాలు లభించాల్సి ఉంది. దాదాపు ఆరు రోజులుగా సైనికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

దాదాపు 19 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ గ్లేసియర్పై భారీ మంచుకొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పదిమంది భారత జవాన్లు గల్లంతయ్యారు. సాధరణంగా సైనికులు కూడా చేరుకోలేని ఈ ప్రాంతంలో అతి క్లిష్టమైన పరిస్థితుల మధ్య గల్లంతైన సైనికుల కోసం ఆరు రోజులుగా గాలిస్తుండగా సోమవారం సాయంత్రం ఓ జవాను మృతదేహం లభ్యమైంది. జవానులు కూరుకుపోయిన ప్రాంతంలో 30 అడుగుల మేర మంచుకొండలు పడిపోయాయి.

>
మరిన్ని వార్తలు