రిపబ్లిక్‌ డే పరేడ్‌లో స్వదేశీ బోఫోర్స్‌ శతఘ్ని!

23 Jan, 2017 03:35 IST|Sakshi
రిపబ్లిక్‌ డే పరేడ్‌లో స్వదేశీ బోఫోర్స్‌ శతఘ్ని!

తొలిసారి ‘ధనుష్‌’ ప్రదర్శన
భోపాల్‌: ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో తొలిసారి దేశీయ బోఫోర్స్‌ శతఘ్ని.. ‘ధనుష్‌’ప్రత్యేక ఆకర్షణ కానుంది. తొలిసారి స్వదేశంలో తయారైన ఈ దీర్ఘ పరిధి శతఘ్నిని పరేడ్‌లో ప్రదర్శించ నున్నారు. ఈ 155 ఎంఎం శతఘ్నిని జబల్పూర్‌కు చెందిన గన్  కారేజ్‌ ఫ్యాక్టరీ (జీసీఎఫ్‌) రూపొందించింది. ఒక్కో దాని ధర రూ.14.5 కోట్లు. 38 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.

ప్రత్యేక అతిథులుగా గిరిజనులు: ఈ నెల 26న ఢిల్లీ రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరుకావాలని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 40 మంది గిరిజనులను కేంద్రం ఆహ్వానించింది. పరేడ్, బీటింగ్‌ రిట్రీట్‌లను వీక్షంచనున్న వీరు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రులను  కలుసుకుంటారు. 

మరిన్ని వార్తలు