బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

28 May, 2016 01:40 IST|Sakshi
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ : భూ ఉపరితల లక్ష్యాలను ఛేదించే సూపర్‌సోనిక్ క్షిపణి బ్రహ్మోస్‌ని భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ కేంద్రంలో భారత వాయుసేన ఈ పరీక్ష నిర్వహించింది. అనుకున్న లక్ష్యాలను క్షిపణి కచ్చితత్వంతో అధిగమించిందని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రకటించింది.

లోపరహిత సామర్థ్యాలు కలిగిన ఈ వ్యవస్థ త్రివిధ దళాలకు సాధికారత చేకూర్చనుం ది.మన విమానాల రాకపోకలను పసిగట్టేందుకు శత్రుదేశాలు సరిహద్దుల వెంట ఏర్పాటుచేసిన  రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలను  కూల్చేసేందుకు ఈ క్షిపణిని భారత వాయుసేన గత ఏడాది తీసుకుంది.

మరిన్ని వార్తలు