ఒక్క కేజ్రీవాల్కి 120మంది ఎంపీలా?

29 Jan, 2015 16:58 IST|Sakshi

న్యూఢిల్లీ:
ఒక్క కేజ్రీవాల్ని ఎదుర్కొనడానికి 120 మంది ఎంపీలని రప్పిస్తున్నారని బీజేపీపై అమ్ అద్మీ పార్టీ ఎదురు దాడికి దిగింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి 120 మంది ఎంపీలని బరిలో దించుతామని కేంద్రమంత్రి అనంత్ కుమార్ వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి నుంచి విమర్శలు రావడంతో వెంటనే ఎంపీలు కూడా పార్టీ కార్యకర్తలే, 120 మంది ఎంపీలు ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి రావడంలేదని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ వివిరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు