మార్చి 9 నుంచి బడ్జెట్‌ సమావేశాల మలి దశ

6 Jan, 2017 03:27 IST|Sakshi
మార్చి 9 నుంచి బడ్జెట్‌ సమావేశాల మలి దశ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల రెండో దశ మార్చి 9 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 13 వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‌(మార్చి 8) ముగిసిన తర్వాతి రోజు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌ సమావేశాల్ని జనవరి 31న ప్రారంభించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఇంతకుముందే సూచించింది. తొలి దశ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకూ కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు