మాజీమంత్రి ఇంట్లో దొంగలు పడ్డారు!

12 Dec, 2016 14:45 IST|Sakshi
మాజీమంత్రి ఇంట్లో దొంగలు పడ్డారు!
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అధికారిక నివాసంలో దొంగలు పడ్డారు. ఆరు విగ్రహాలు, ఒక యాంటిక్ పీస్‌తో పాటు రాగి కళ్లజోడును కూడా దొంగలు ఆయన ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. నవంబర్ 29వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగిందని థరూర్ పోలీసులకు తెలిపారు. థరూర్ కార్యాలయం తాళాలు పగిలి ఉండటాన్ని ఆయన ఇంట్లో పనిచేసేవారిలో ఒకరు గుర్తించి తెలిపారు. ఈ భవనం మెయిన్‌రోడ్డులోనే ఉండటంతో, ప్రహరీ ఎక్కి లోనికి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీధుల్లో తిరిగేవాళ్లు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారని, వాళ్లకు ఇక్కడకు సమీపంలోని సాయి ఆలయం వాళ్లు వారికి దుస్తులు ఇస్తారని, అందుకే ఇక్కడ తిరుగుతూ దొంగతనాలు చేస్తారని చెప్పారు. థరూర్ ఇంటి సమీపం నుంచి ఒక ప్రకటన బోర్డును కూడా కొన్నివారాల క్రితం ఎవరో చోరీ చేశారని తెలిపారు. 
 
ఇంతకుముందు కూడా విగ్రహాలు చోరీచేసిన ఒక గ్యాంగు హస్తాన్ని అనుమానిస్తున్నట్లు న్యూఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ చెప్పారు. మెయిన్‌గేటు తాళాలు వేసినవి వేసినట్లే ఉన్నాయని థరూర్ కారా్యాల సిబ్బంది తెలిపారు. రోడ్డుమీద ఉన్న ఫుట్‌పాత్ నుంచి ప్రహరీ ఎక్కడం చాలా సులభమని కూడా అన్నారు. ఈ చోరీపై పోలీసులు తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని వార్తలు