కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6% డీఏ పెంపు

9 Sep, 2015 13:08 IST|Sakshi
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6% డీఏ పెంపు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించే కరువు భత్యాన్ని(డీఏ) ఆరు శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో మూల వేతనంపై 119 శాతానికి డీఏ పెరిగినట్లయింది.  జూలై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. ఆరో వేతన సంఘం సిఫారసుల మేరకు ఈ పెంపు చోటు చేసుకుంది. గతంలో 113 శాతంగా ఉండిన డీఏ ప్రస్తుతం 119 శాతానికి పెరిగింది.
 
 

మరిన్ని వార్తలు