కేంద్ర కేబినెట్ కార్యదర్శి సేథ్ పదవీకాలం పొడగింపు

5 Dec, 2014 14:18 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ పదవీకాలాన్ని పొడగించారు. ఈ నెల 13తో సేథ్ పదవీకాలం ముగియనుండగా, మరో ఆరు నెలల పాటు పొడగించారు. దీంతో సేథ్ వచ్చే ఏడాది జూన్ వరకు కేబినెట్ కార్యదర్శిగా కొనసాగుతారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు