కేబినెట్ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు

6 Dec, 2014 01:57 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్ పదవీకాలాన్ని మోదీ సర్కారు మరో ఆరు నెలలు పొడిగించింది. ఆయనకు ఈ పొడిగింపు లభించడం ఇది మూడోసారి. ఈ నెల 13 నుంచి ఆరు నెలలపాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు